Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

ఇంద్రకీలాద్రిపై భక్తులకు చల్లని మజ్జిగ, తాగునీటి పంపిణీ

ఇంద్రకీలాద్రిపై వేసవి కాలంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఉచిత తాగునీరు, చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది.

AP/SOUTH

ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇంద్రకీలాద్రికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) మరియు స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్ వి.కె. శీనా నాయక్ ఆదేశాల మేరకు, వేసవి కాలం ముగిసే వరకు భక్తులకు ఉచిత తాగునీరు మరియు చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమంను విస్తృతంగా అమలు చేస్తున్నారు. దేవస్థానం తరఫున ప్రతిరోజూ కొండపైకి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు నిరంతర ఉచిత తాగునీటి సదుపాయం కల్పించారు. అదేవిధంగా, ఉగాది పర్వదినం నుంచి జూన్ 15వ తేదీ వరకు నిరంతరాయంగా మజ్జిగ పంపిణీ కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు. సాధారణ రోజుల్లో ప్రతిరోజూ 2,000 మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయనున్న దేవస్థానం, భక్తుల రద్దీ అధికంగా ఉండే శుక్రవారం, శనివారం, ఆదివారం రోజుల్లో 5,000 మజ్జిగ ప్యాకెట్లు లేదా అంతకంటే ఎక్కువ పంపిణీ చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలనుకునే దాతలు రోజుకు కేవలం రూ.650 చెల్లించి, అధికారిక రశీదు పొంది ఈ పథకానికి విరాళం అందించవచ్చని ఈవో వి.కె. శీనా నాయక్ తెలిపారు. వేసవిలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్న ఆయన, ఈ సేవా కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పత్రికా ప్రతినిధులను కోరారు. అలాగే, అధిక సంఖ్యలో దాతలు ముందుకు వచ్చి ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.