తిరుపతి జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఉచ్చుపన్ని, జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రెడ్డన్నను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. గుడిమల్లం గ్రామానికి చెందిన సుభాన్ తన భార్య పేరుతో రూ.50 లక్షల వ్యయంతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఫిషరీస్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టుకు 60 శాతం సబ్సిడీగా రూ.30 లక్షలు మంజూరు కావాల్సి ఉంది. ఈ సబ్సిడీకి పరిపాలనా అనుమతి ఇవ్వడానికి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ రెడ్డన్న రూ.3 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని, తొలి విడతగా రూ.1 లక్షను మరో వ్యక్తి ద్వారా స్వీకరిస్తుండగా రెడ్డన్నను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, మత్స్యశాఖ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తూ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
3 లక్షల లంచం ఆరోపణలు.. తిరుపతి మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్పై ఏసీబీ చర్యలు
తిరుపతి మత్స్యశాఖలో ఏసీబీ దాడులు.. రూ.3 లక్షల లంచం ఆరోపణల కేసులో డిప్యూటీ డైరెక్టర్ రెడ్డన్నపై చర్యలు, దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Sign in with Google to comment.