భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకురాలు సావిత్రిబాయి జ్యోతిరావు పూలే అని మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకురాలు గూడవరమ్మ ఐలయ్య గౌడ్ అన్నారు. కుత్బుల్లాపూర్లోని జగద్గిరిగుట్ట కార్యాలయంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మహిళలకు విద్య అవసరాన్ని గుర్తించి కుల, మత భేదాలు లేకుండా మొదటిసారిగా స్త్రీలకు పాఠశాలలు ప్రారంభించి విద్య అందించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని పేర్కొన్నారు. మహిళలు ఆమె స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వము మహిళా విద్యకు ప్రాధాన్యత ఇస్తూ బాలికలకు స్కూటీలు అందించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, మహిళలు పాల్గొని సావిత్రిబాయి పూలేకు ఘనంగా నివాళులు అర్పించారు.
సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో మహిళలు ముందుకు రావాలి గూడవరమ్మ ఐలయ్య గౌడ్
సావిత్రిబాయి పూలే మహిళా విద్యకు మార్గదర్శి, ఆమె స్ఫూర్తితో మహిళలు ముందుకు రావాలి: గూడవరమ్మ ఐలయ్య గౌడ్.
Comments
Sign in with Google to comment.