ఏప్రిల్ 1: అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏప్రిల్ నెల నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటి వరకు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా జీతాలు చెల్లించే విధానం అమల్లో ఉండేది. ఈ ప్రక్రియలో కమిషన్ల పేరిట కొంత మొత్తం కోతపడటం, అలాగే నెలల తరబడి జీతాలు ఆలస్యంగా రావడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజా నిర్ణయంతో ఈ సమస్యలకు చెక్ పడనుంది.
మున్సిపాలిటీలు, గురుకులాలు, విద్యా సంస్థలు, ఆరోగ్య శాఖ, మైనార్టీ సంక్షేమ శాఖల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు ఇది నేరుగా లాభం చేకూరనుంది. జీతాలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ కావడం వల్ల పారదర్శకత పెరగడమే కాకుండా, మధ్యవర్తుల ప్రమేయం తగ్గి ఉద్యోగులకు సమయానికి పూర్తి వేతనం అందే అవకాశం ఉంటుంది.
ఈ కీలక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి Revanth Reddy తీసుకున్నారు.
Comments
Sign in with Google to comment.