Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

హోర్ముజ్ సంక్షోభం మరింత ముదురు.. ఇరాన్ క్షిపణి దాడులతో ప్రపంచం ఉలిక్కిపాటు!

"జూలై 8న అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్‌లలోని అమెరికా స్థావరాలపై దాడులు ప్రారంభించింది. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి

Breaking News

దుబాయ్ | జూలై 8:

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. అమెరికా తాజాగా ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలు, నౌకాదళ లక్ష్యాలపై భారీ దాడులు జరిపిన కొద్ది గంటల్లోనే, ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. బహ్రెయిన్ మరియు కువైట్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించింది.

 ఇరాన్ విప్లవ గార్డులు ఈ దాడులకు బాధ్యత వహిస్తూ, బహ్రెయిన్‌లోని అమెరికా ఐదవ నౌకాదళ కేంద్రం, కువైట్‌లోని అలీ అల్ సలేం ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకున్నామని వెల్లడించాయి. అలాగే గల్ఫ్ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న అమెరికా MQ-9 డ్రోన్‌ను కూల్చివేసినట్లు కూడా ప్రకటించాయి.

దాడుల నేపథ్యంలో బహ్రెయిన్, కువైట్ దేశాలు తమ వైమానిక రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేసి, వచ్చిన క్షిపణులు మరియు డ్రోన్లను అడ్డుకునే చర్యలు చేపట్టాయి.

 ఇదిలా ఉండగా, అమెరికా ఇరాన్‌కు చెందిన 60కు పైగా సైనిక కేంద్రాలు, క్షిపణి వ్యవస్థలు, నౌకాదళ స్థావరాలపై దాడులు జరిపినట్లు సమాచారం. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల అనంతరం ఈ చర్యలకు అమెరికా దిగినట్లు తెలుస్తోంది.

ఈ తాజా పరిణామాలు మధ్యప్రాచ్య ప్రాంతాన్ని మరోసారి యుద్ధ అంచుకు తీసుకెళ్లాయి. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు మరిన్ని దాడులకు గురయ్యే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో హోర్ముజ్ జలసంధి ద్వారా జరిగే చమురు రవాణాపై ప్రభావం పడుతుందనే భయాలతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి.

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.