ఉప్పల్ ఆదర్శ్ నగర్ కాలనీకి చెందిన ఓ మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాకపోవడంతో ఉప్పల్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సారంగా జమున (36), భర్త రాముడు, గత కొంతకాలంగా కుటుంబ సభ్యులతో కలిసి ఉప్పల్ ఆదర్శ్ నగర్లో నివాసం ఉంటున్నారు. అయితే ఈ నెల 3వ తేదీన కుటుంబ విషయాలపై భర్త, పిల్లలతో జరిగిన గొడవ అనంతరం మధ్యాహ్నం సుమారు 2.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఆమె తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భర్త రాముడు మే 4న ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫోటోలో కనిపిస్తున్న మహిళ ఎవరికైనా కనిపించినా లేదా సమాచారం తెలిసినా వెంటనే ఉప్పల్ పోలీసులను సంప్రదించాలని పోలీసులు కోరారు.
ఉప్పల్లో మహిళ అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసులు గాలింపు
ఉప్పల్ ఆదర్శ్ నగర్కు చెందిన మహిళ కుటుంబ కలహాల తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోగా, ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Sign in with Google to comment.