రామంతాపూర్లో మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజా సమస్యలపై అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ మరియు ఇతర మౌలిక సదుపాయాల సమస్యలు తీవ్రమైన స్థాయిలో ఉన్నాయని, ప్రజల సమస్యలను పాలకపక్షాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తమైంది. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని, ప్రజలను నమ్మించి మోసం చేశారని విమర్శించారు. అధికారులు కూడా ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సమావేశంలో పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి బీజేపీ కట్టుబడి పనిచేస్తుందని ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యులు భేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు, క్రియాశీలక సభ్యులు మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Sign in with Google to comment.