హైదరాబాద్, ఏప్రిల్ 7 (ప్రతినిధి): చెస్లో ప్రపంచ స్థాయి గిన్నిస్ రికార్డు సాధించిన బాల ప్రతిభావంతుడు శ్రీయాన్ష్ మురళీ కృష్ణ పటేల్కు మంత్రి వాకిటి శ్రీహరి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అతి చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ కనబరిచిన శ్రీయాన్ష్ విజయాన్ని తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా అభివర్ణించారు. కేవలం 2 సంవత్సరాలు 11 నెలల వయసులోనే చెస్లో గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు చేయడం విశేషమని మంత్రి పేర్కొన్నారు. సాధారణంగా 30 నిమిషాల్లో పూర్తి చేయాల్సిన లక్ష్యాన్ని, శ్రీయాన్ష్ కేవలం 15 నిమిషాల్లోనే 21 చెక్మేట్లు చేసి పూర్తి చేయడం అతని ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. శ్రీయాన్ష్ ఆటతీరు “నభూతో నా భవిష్యత్” అన్నట్టుగా ఉందని మంత్రి ప్రశంసించారు. ఇలాంటి ప్రతిభావంతులు రాష్ట్రానికి ప్రేరణగా నిలుస్తారని చెప్పారు. జూన్ నెలలో బ్రిటన్ పార్లమెంట్లో శ్రీయాన్ష్కు అవార్డు అందనున్న నేపథ్యంలో ఆయనకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ దంపతులు, శ్రీయాన్ష్ తల్లిదండ్రులు కొండా సుస్మితా, అభిలాష్, కోచ్ రాజశేఖర్, గిన్నిస్ బుక్ ప్రతినిధి ఉజ్వల చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.
Comments
Sign in with Google to comment.