నేడు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా తిరుమలలోని శ్రీవారి ఆలయం దాదాపు 10 గంటల పాటు మూతపడనుంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషాలకు గ్రహణం ప్రారంభమై సాయంత్రం 6 గంటల 47 నిమిషాల వరకు కొనసాగనుంది. గ్రహణం ప్రభావం దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలోని అన్ని ఆలయాలను ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు మూసివేయాలని అధికారులు నిర్ణయించారు.
ఈ విషయాన్ని అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి వెల్లడించారు. అనంతరం ఆలయ శుద్ధి కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత భక్తులకు దర్శనాలు పునఃప్రారంభం అవుతాయని ఆయన తెలిపారు. అలాగే గ్రహణం నేపథ్యంలో టీటీడీ నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కేంద్రాలను కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్లు వారు స్పష్టం చేశారు. భక్తులు ఈ మార్పులను గమనించి తమ దర్శన ఏర్పాట్లు చేసుకోవాలని వారు కోరారు.
Comments
Sign in with Google to comment.