Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిన దేవస్థానం

వేసవి రద్దీతో ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి నెలకొనగా, దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లతో దర్శనాన్ని సాఫీగా నిర్వహించింది.

AP/SOUTH

ఇంద్రకీలాద్రి పై శుక్రవారం భారీగా భక్తులు తరలివచ్చారు. వేసవి సెలవులు, శుక్రవారం కావడంతో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో భక్తుల రద్దీ అధికమైంది. తీవ్ర ఎండలను సైతం లెక్కచేయకుండా వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు.

 భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఇన్‌చార్జ్ ఈఓ రంగారావు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

 రోజంతా క్యూలైన్లను స్వయంగా పర్యవేక్షిస్తూ భక్తులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. దర్శనం సాఫీగా జరిగేలా అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో సాధారణ భక్తులకు త్వరగా దర్శనం కల్పించేందుకు ఉదయం 10 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు వేగంగా దర్శనం లభించింది. వేసవి ఎండల నుంచి ఉపశమనం కలిగించేందుకు క్యూలైన్లలో భక్తులకు చల్లని మజ్జిగ, శుద్ధి చేసిన తాగునీటిని నిరంతరాయంగా పంపిణీ చేశారు.

 అదేవిధంగా రోజంతా ఉచిత అన్నప్రసాదం, పులిహోర ప్రసాదాలను అందుబాటులో ఉంచారు. ధర్మకర్తల మండలి సభ్యులు కూడా భక్తుల సేవలో పాల్గొని స్వయంగా నీరు, మజ్జిగ పంపిణీ చేశారు. దేవస్థానం చేపట్టిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.