ఆంధ్రప్రదేశ్: ఏకాంతంగా గడపాలని అటవీ ప్రాంతానికి వెళ్లిన ఓ ప్రేమ జంటకు ఊహించని ప్రమాదం ఎదురైంది. తెగిపడిన విద్యుత్ వైర్లు తగలడంతో యువకుడు తీవ్రంగా గాయపడగా, అతనితో ఉన్న యువతి స్వల్ప గాయాలతో బయటపడింది.
సత్యసాయి జిల్లా కదిరి మండలం బత్తలపల్లి తాండా సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఫయాజ్ అనే యువకుడు ఓ యువతితో కలిసి అడవికి వెళ్లిన సమయంలో పైనుంచి తెగిపడిన విద్యుత్ వైర్లు వారిపై పడినట్లు తెలుస్తోంది.
విద్యుత్ షాక్కు గురైన ఫయాజ్ తీవ్రంగా గాయపడగా, యువతి స్వల్ప గాయాలతో బయటపడింది. ప్రమాదం తర్వాత యువతి చేసిన కేకలు విని సమీపంలో ఉన్న గొర్రెల కాపరులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ఫయాజ్ పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Sign in with Google to comment.