Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

శ్రీశైల దేవాలయం లో అన్నప్రసాద వితరణను పరిశీలించిన ఈఓ శ్రీనివాసరావు

శ్రీశైల దేవాలయంలో అన్నప్రసాద సేవలపై ఈఓ శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించి, భక్తులకు మెరుగైన సౌకర్యాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

AP/SOUTH

శ్రీ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాద వితరణ సేవలను కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం. శ్రీనివాసరావు ఆదివారం పరిశీలించారు.

 పరిపాలనాంశాల సమీక్షలో భాగంగా ఆయన అన్నప్రసాద వితరణ భవనాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా అన్నప్రసాద వితరణ భవనంలోని విరాళాల సేకరణ కేంద్రాన్ని పరిశీలించిన ఈఓ, అనంతరం అధికారులతో సమావేశమై భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలను వడ్డించిన శ్రీనివాసరావు, భోజనం స్వీకరిస్తున్న భక్తులతో నేరుగా మాట్లాడి వడ్డన, రుచి, పరిశుభ్రత వంటి అంశాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు.

 అన్నప్రసాద వితరణలో శివసేవకుల సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా శివసేవకులకు ప్రత్యేక అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రతి హాల్లో అన్నప్రసాద వితరణ సజావుగా జరిగేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. వండిన ప్రతి వంటకం ప్రతి భక్తుడికి అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అలాగే అన్ని హాల్స్‌లో సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు. అన్నప్రసాద వంటకాలు రుచికరంగా, నాణ్యంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, తాజా కూరగాయలను మాత్రమే వినియోగించాలని సూచించారు. అదేవిధంగా వంటశాల, ప్రసాద వితరణ హాల్స్‌, భవన ప్రాంగణంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి ఆదేశించారు.

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.