Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

ఇంద్రకీలాద్రిపై పూర్తి నగదు రహిత సేవలకు శ్రీకారం – వాట్సాప్ ద్వారా దర్శనం, ప్రసాదం టిక్కెట్లు అందుబాటులోకి

ఇంద్రకీలాద్రి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం వాట్సాప్ ద్వారా దర్శనం, ప్రసాదం టిక్కెట్లతో పూర్తి నగదు రహిత సేవలు ప్రారంభం.

AP/SOUTH

ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో భక్తులకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు పూర్తి నగదు రహిత (100% Cashless) విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్తులు క్యూలైన్లలో ఎక్కువసేపు వేచి ఉండకుండా డిజిటల్ సేవలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా శుక్రవారం దేవస్థాన ఇంజినీరింగ్, ఐటీ, కౌంటర్లు, భద్రతా విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఈవో, అనంతరం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. వాట్సాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుని దర్శనానికి వచ్చిన భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా భక్తులు తమ మొబైల్ ఫోన్లలోనే దర్శనం టిక్కెట్లు, సేవా టిక్కెట్లు, లడ్డూ ప్రసాదం టిక్కెట్లు, కేశఖండన టిక్కెట్లు తదితర సేవలను డిజిటల్ చెల్లింపుల ద్వారా సులభంగా పొందవచ్చని తెలిపారు.

ఆన్‌లైన్, వాట్సాప్ సేవలపై భక్తులకు అవగాహన కల్పించేందుకు శ్రీ కనకదుర్గ నగర్ మరియు ఘాట్ రోడ్డులోని ‘ఓం’ టర్నింగ్ వద్ద ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ఈవో ఆదేశించారు. అక్కడ హై-స్పీడ్ ఇంటర్నెట్, క్యూ ఆర్ కోడ్ స్టాండ్లు, కంప్యూటర్ సిస్టమ్స్ వంటి సాంకేతిక సదుపాయాలు కల్పించాలని ఐటీ విభాగానికి సూచించారు. భక్తులకు మర్యాదపూర్వకంగా సేవలు అందించేందుకు తగిన సిబ్బందిని షిఫ్టుల వారీగా విధుల్లో నియమించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎల్. రమాదేవి, ఐటీ నిపుణులు, కౌంటర్ల సూపరింటెండెంట్లు తదితర అధికారులు పాల్గొన్నారు.

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.