Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

ధర్మకర్తల మండలి సమావేశం యోగాంధ్ర నిర్వహణ భక్తుల సౌకర్యాలపై కీలక నిర్ణయాలు

యోగాంధ్ర నిర్వహణ భక్తుల సౌకర్యాల మెరుగుదల మొక్కల పెంపకం క్యూకాంప్లెక్స్ నిర్మాణ వేగవంతం పై ధర్మకర్తల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది

AP/SOUTH

శ్రీశైల  దేవస్థానం ధర్మకర్తల మండలి 7వ సమావేశం మంగళవారం కార్యాలయ భవనంలోని సమావేశ మందిరంలో నిర్వహించబడింది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనగా, కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ప్రత్యక్షంగా హాజరయ్యారు.

 సమావేశంలో మొత్తం ఆరు అజెండా అంశాలను చర్చించగా, రెండు అంశాలకు ఆమోదం లభించింది. రెండు అంశాలను వాయిదా వేయగా, మరో రెండు అంశాలను తిరస్కరించారు. మిగిలిన 21 అజెండా అంశాలను ఈ నెల 11న జరిగే తదుపరి సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు.

యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, జూన్ 11న ప్రత్యేక యోగా కార్యక్రమం, జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ కార్యక్రమాల్లో స్థానికులు, యాత్రికులు అధిక సంఖ్యలో పాల్గొనేలా విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాబోయే వర్షాకాలంలో క్షేత్ర పరిధిలో 5 వేల నుంచి 6 వేల మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. నీడనిచ్చే మొక్కలతో పాటు దేవతా వృక్షాల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని సభ్యులు సూచించారు. భక్తుల సౌకర్యాల మెరుగుదలకు తిరుమల తరహాలో పిలిగ్రిమ్స్ అమినిటీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, క్యూకాంప్లెక్స్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. అలాగే పారిశుద్ధ్య నిర్వహణను మరింత బలోపేతం చేయాలని సూచించింది. అదేవిధంగా, శ్రీశైలక్షేత్ర దత్తత దేవాలయమైన జ్యోతిస్సిద్ధవటం ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నెలవారీ పారితోషికాన్ని పెంచాలని సమావేశంలో తీర్మానించారు.

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.