హైదరాబాద్: శ్రావణ మాసం ప్రారంభం కావడంతో పండుగల సందడి మొదలైంది. మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే వరలక్ష్మీ వ్రతం ఈ ఏడాది ఆగస్టు 21నా, ఆగస్టు 28నా? అనే అంశంపై భక్తుల్లో సందిగ్ధత నెలకొంది
. తెలుగు పంచాంగం, ఆగమ శాస్త్రాల ప్రకారం సాధారణంగా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీగా కొనసాగుతోందిఅందువల్ల రెండు తేదీల ప్రస్తావనకు కారణం వ్రతాన్ని ఆచరించే సమయం మాత్రమేనని, భక్తులు తమ కుటుంబ సంప్రదాయం, గురువుల లేదా స్థానిక ఆలయ అర్చకుల సూచనల మేరకు తేదీని నిర్ణయించుకోవాలని ధర్మశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.. అయితే ఈసారి శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు రావడం వల్ల తేదీ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పండితుల వివరణ ప్రకారం, ఆగస్టు 28న పౌర్ణమి తిథి ఉదయం కొనసాగుతున్నందున ఉదయం సమయంలో వ్రతం చేసే వారు ఆ రోజునే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం శాస్త్రోక్తం. అదే సమయంలో, సాయంత్రం వ్రత పూజ నిర్వహించే సంప్రదాయాన్ని అనుసరించే వారు పౌర్ణమి తిథి సాయంత్రానికి లేకపోవడంతో ఆగస్టు 21న వ్రతాన్ని నిర్వహించడం సముచితం అని సూచిస్తున్నారు.
Comments
Sign in with Google to comment.