ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయ నిధి అండగా నిలుస్తోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ తెలిపారు. చింతల్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా సుభాష్ నగర్ డివిజన్కు చెందిన లబ్ధిదారులు కొలుపులు సాయి, గిరిజ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.1.50 లక్షల మంజూరు పత్రాలను అందజేశారు. మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్, టీఆర్ఎస్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఈ పత్రాలు లబ్ధిదారులకు అందించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వివేకానంద్
సీఎం సహాయనిధి ద్వారా లబ్ధిదారులకు రూ.1.50 లక్షల మంజూరు పత్రాలు అందజేత. ఎమ్మెల్యే వివేకానంద్.
Comments
Sign in with Google to comment.