Latest
మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత

క్రమశిక్షణే విద్యార్థి భవిష్యత్తుకు పునాది: రజిత పరమేశ్వర్ రెడ్డి

సెల్‌ఫోన్ పిల్లలకు నరకం లాంటిది మాజీ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి,

Hyderabad News

ఉప్పల్ ప్రాంతంలో విద్యా రంగంలో సృజన స్కూల్ స్థాపనతోనే సరికొత్త మార్పు ప్రారంభమైందని ఉప్పల్ మాజీ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత సృజన స్కూల్ వ్యవస్థాపకులు కీ.శే. రఘునందన్ రెడ్డి గారికే దక్కుతుందని అన్నారు.

ఉప్పల్‌లోని శిల్పారామంలో నిర్వహించిన సృజన హైస్కూల్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రజిత పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “విద్యను వ్యాపారంగా కాకుండా, సేవగా, చారిటీ భావంతో సృజన స్కూల్‌ను నడిపించారు” అని రఘునందన్ రెడ్డి సేవలను స్మరించుకున్నారు. అలాగే, వారి కుటుంబ సభ్యులు కూడా అదే స్ఫూర్తితో విద్యాసేవను కొనసాగించాలని కోరారు.

 

సభలో మాట్లాడిన రజిత పరమేశ్వర్ రెడ్డి, “మత్తు వదలండి – మైదానానికి రండి, మత్తు వదలండి – చదువుతో సత్తా చాటండి” అనే నినాదం కేవలం మాటగా కాకుండా, రేపటి తరానికి మార్గదర్శకంగా మారాలని ఆకాంక్షించారు. ఆమె ప్రసంగం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను ఆలోచింపజేసేలా సాగింది.

చిన్నప్పటి నుంచే విలువలతో కూడిన విద్య అవసరం” “మొక్కై వంగనిది మానై వంగునా” అనే సామెతను ప్రస్తావిస్తూ, పిల్లలకు చిన్నప్పటి నుంచే విలువలతో కూడిన విద్య, క్రమశిక్షణ, బాధ్యతా భావం నేర్పించాలని రజిత పరమేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు కేవలం ఫీజులు కట్టడమే కాకుండా, పిల్లలతో సమయం గడపాలని వారి స్నేహితుల వర్గాన్ని గమనించాలని వారి ప్రవర్తనపై శ్రద్ధ పెట్టాలని సూచించారు

పాఠశాలలు దేవాలయాలు.. ఉపాధ్యాయులు మార్గదర్శులు” ఉపాధ్యాయులు పిల్లల శ్రేయస్సు కోసం క్రమశిక్షణను పాటింపజేస్తే, దానిని తప్పుగా అర్థం చేసుకునే ధోరణి మారాలని ఆమె అభిప్రాయపడ్డారు. తన చిన్ననాటి అనుభవాన్ని గుర్తు చేస్తూ, “ఉపాధ్యాయుల క్రమశిక్షణే నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది” అని పేర్కొన్నారు. పాఠశాలలను దేవాలయాలుగా భావించి, అంకితభావంతో చదివితేనే విద్యార్థులు ఉన్నత భవిష్యత్తును సాధించగలరని తెలిపారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేస్తేనే విద్యార్థి దశలో మార్పు వచ్చి, మంచి సమాజం నిర్మితమవుతుందని అన్నారు.

 

 

Related Stories

Latest Articles

  1. మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి
  2. భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది.
  3. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది.
  4. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది.
  5. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత
  6. ఎస్‌పీ–బీఎస్పీ యూపీ ప్రభుత్వాన్ని తీవ్ర ఉష్ణతరంగం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఒత్తిడిని కలిగించినందుకు విమర్శించాయి.
  7. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వైరల్ crowdsourced అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించింది, భారీ ఆన్‌లైన్ చర్చను ప్రేరేపించింది
  8. ఇరాన్ సంక్షోభం ట్రంప్‌ను తన కొడుకు వివాహానికి హాజరుకాకుండా చేయవచ్చని, "కృత్రిమ వార్తలు నన్ను ఏదో ఒక విధంగా చంపుతాయి" అని చెప్పారు.
  9. భారత మహిళా శాస్త్రవేత్త అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనలో చరిత్ర సృష్టించింది
  10. ఇంధన ధరల షాక్, పడుతున్న రూపాయి భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తున్నాయి; మధ్య తరగతి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
Comments

Sign in with Google to comment.