తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ఉప్పల్ మినీ శిల్పారామంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా శ్రీమతి చైతన్య కుసుమ ప్రియ శిష్య బృందం అద్భుతమైన భరతనాట్య ప్రదర్శనతో అలరించింది. కళాకారులు పుష్పాంజలి, కల్యాణరామ, స్వరజతి, ఇందెందు వచ్చితివిరా, రంజనిమాల, సూర్యాష్టకం, ఆంజనేయ కీర్తనం, తిల్లాన తదితర నృత్యాంశాలను ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
తనూజ, శ్రీలత, నమ్రత, లాశ్రీత సాయి, అనన్య, హర్షిని, నీతిక, కావ్య, తారిణి తదితర కళాకారులు తమ ప్రతిభను చాటుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ భరతనాట్య గురువు శ్రీమతి గీత గణేశన్ కళాకారుల ప్రదర్శనను అభినందిస్తూ, వారి ప్రతిభను కొనియాడారు. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో ఈ భరతనాట్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Comments
Sign in with Google to comment.