అమ్మానాన్న జ్ఞాన మందిరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీమతి మణేమ్మ వంశరాజ్ మరియు ఫౌండేషన్ చైర్మన్ ఇరుగజీవ తిరుపతయ్య వంశరాజ్ నాయకత్వంలో గత నెల రోజులుగా రామంతపూర్ వంశరాజ్ సంక్షేమ సంఘం ప్రాంగణంలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ ఘనంగా ముగిసింది. ఈ శిబిరంలో విద్యార్థినీ, విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసాన్ని లక్ష్యంగా పెట్టుకుని కరాటే, స్పోకెన్ ఇంగ్లీష్, యోగా తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలలో కుటుంబ విలువలు, తల్లిదండ్రుల పట్ల గౌరవ భావాన్ని పెంపొందించే ఉద్దేశంతో వారి తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శిక్షణలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులకు పురస్కారాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ పాత్రికేయులు శ్రీ పాశం యాదగిరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, పేద కుటుంబం నుంచి ఎదిగి సమాజ సేవకు అంకితభావంతో పనిచేస్తున్న ఇరుగజీవ తిరుపతయ్య వంశరాజ్ అమ్మానాన్న జ్ఞాన మందిరం ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించడంతో పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించడం అత్యంత అభినందనీయమని కొనియాడారు. విద్య ద్వారా సమాజాభివృద్ధికి కృషి చేస్తున్న ఆయన సేవలు యువతకు, సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా గురూజీ ఆచార్య రమేష్ ఆధ్వర్యంలో పాదపూజ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో తవిడిపోయిన గిరిబాబు, మురళి గౌడ్, చిటికెల కృష్ణయ్య, రాసని బాలస్వామి, పాయసం గోపాల్, చిన్నకృష్ణ, వెంకటయ్య, చందు, చిటికెల రామకృష్ణ, జి. వీరస్వామి, బాలు, సురేష్, బాలస్వామి, మల్లేష్, నరసింహ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Comments
Sign in with Google to comment.