Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

బీసీ విద్యార్థుల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన ఆర్. కృష్ణయ్య.. 120 కొత్త హాస్టళ్లు, 150 గురుకులాల మంజూరు చేయాలని విజ్ఞప్తి

బీసీ విద్యార్థుల కోసం 120 కొత్త హాస్టళ్లు, 150 గురుకులాలు, సీట్ల పెంపు కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆర్. కృష్ణయ్య కలిశారు.

Hyderabad News

తెలంగాణ రాష్ట్రంలోని బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న హాస్టళ్లు, గురుకులాల సీట్ల కొరతను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 120 కొత్త బీసీ కాలేజ్ హాస్టళ్లు, 150 బీసీ గురుకులాలు ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం హాస్టల్ సీట్లు లేక వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రైవేట్ హాస్టళ్లలో అధిక ఫీజులు చెల్లించాల్సి వస్తోందని, కొందరు చదువులు కూడా మానుకుంటున్నారని ఆర్. కృష్ణయ్య వివరించారు. హైదరాబాద్‌తో పాటు మహబూబ్‌నగర్, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, నల్లగొండ, కరీంనగర్, మేడ్చల్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో కొత్త హాస్టళ్లు మంజూరు చేయాలని కోరారు. బీసీ గురుకులాల్లో అడ్మిషన్లకు భారీ డిమాండ్ ఉన్నప్పటికీ సీట్లు లేక వేలాది మంది విద్యార్థులు అవకాశాలు కోల్పోతున్నారని, ఎస్ ఎస్ సి, ఇంటర్‌లో 99 శాతం ఫలితాలు సాధించడంతో గురుకులాలకు మరింత ఆదరణ పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 52 శాతం బీసీ జనాభాకు తగినన్ని గురుకులాలు లేవని, అందుకే అదనంగా 150 గురుకులాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉన్న గురుకులాల్లో ఖాళీ తరగతి గదులను వినియోగించి అదనపు సెక్షన్లు ప్రారంభించాలని, జూనియర్ కాలేజీల్లో ప్రతి క్లాస్‌లో 30 సీట్లను 40కు పెంచాలని కూడా ఆర్. కృష్ణయ్య సూచించారు. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం ఉండదని వివరించారు. ఆర్. కృష్ణయ్య ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రితో చర్చించి కొత్త హాస్టళ్లు, గురుకులాలు, అదనపు సెక్షన్లు, సీట్ల పెంపుపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.