Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

బీసీ విద్యార్థుల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన ఆర్. కృష్ణయ్య.. 120 కొత్త హాస్టళ్లు, 150 గురుకులాల మంజూరు చేయాలని విజ్ఞప్తి

బీసీ విద్యార్థుల కోసం 120 కొత్త హాస్టళ్లు, 150 గురుకులాలు, సీట్ల పెంపు కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆర్. కృష్ణయ్య కలిశారు.

Hyderabad News

తెలంగాణ రాష్ట్రంలోని బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న హాస్టళ్లు, గురుకులాల సీట్ల కొరతను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 120 కొత్త బీసీ కాలేజ్ హాస్టళ్లు, 150 బీసీ గురుకులాలు ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం హాస్టల్ సీట్లు లేక వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రైవేట్ హాస్టళ్లలో అధిక ఫీజులు చెల్లించాల్సి వస్తోందని, కొందరు చదువులు కూడా మానుకుంటున్నారని ఆర్. కృష్ణయ్య వివరించారు. హైదరాబాద్‌తో పాటు మహబూబ్‌నగర్, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, నల్లగొండ, కరీంనగర్, మేడ్చల్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో కొత్త హాస్టళ్లు మంజూరు చేయాలని కోరారు. బీసీ గురుకులాల్లో అడ్మిషన్లకు భారీ డిమాండ్ ఉన్నప్పటికీ సీట్లు లేక వేలాది మంది విద్యార్థులు అవకాశాలు కోల్పోతున్నారని, ఎస్ ఎస్ సి, ఇంటర్‌లో 99 శాతం ఫలితాలు సాధించడంతో గురుకులాలకు మరింత ఆదరణ పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 52 శాతం బీసీ జనాభాకు తగినన్ని గురుకులాలు లేవని, అందుకే అదనంగా 150 గురుకులాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉన్న గురుకులాల్లో ఖాళీ తరగతి గదులను వినియోగించి అదనపు సెక్షన్లు ప్రారంభించాలని, జూనియర్ కాలేజీల్లో ప్రతి క్లాస్‌లో 30 సీట్లను 40కు పెంచాలని కూడా ఆర్. కృష్ణయ్య సూచించారు. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం ఉండదని వివరించారు. ఆర్. కృష్ణయ్య ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రితో చర్చించి కొత్త హాస్టళ్లు, గురుకులాలు, అదనపు సెక్షన్లు, సీట్ల పెంపుపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.