న్యూఢిల్లీ: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థుల ఆందోళనలపై జరుగుతున్న చర్చను ఎదుర్కొనే ధైర్యం లేకనే అమిత్ షా సభకు రాలేదని ఆరోపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలతో లోక్సభలో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది.
విద్యార్థుల ఉద్యమం దేశ యువత ఆకాంక్షలకు ప్రతిబింబమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న విద్యార్థుల గొంతును అణచివేయకుండా, వారి ప్రజాస్వామ్య హక్కులను అన్ని రాజకీయ పార్టీలు గౌరవించాలని ఆయన కోరారు. చర్చ సందర్భంగా అమిత్ షా గైర్హాజరుపై ప్రశ్నించిన రాహుల్, "హోంమంత్రి ఎందుకు సభకు రావడం లేదు? ఎందుకంటే ఆయన భయపడుతున్నారు. నన్ను ఎదుర్కొనే ధైర్యం ఆయనకు లేదు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు సభలో తీవ్ర వాగ్వాదానికి దారితీశాయి. అయితే పార్లమెంటరీ నిబంధనల ప్రకారం రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలను అనంతరం లోక్సభ రికార్డుల నుంచి తొలగించారు. సభా మర్యాదలకు విరుద్ధంగా ఉన్నాయనే కారణంతో వాటిని ఎక్స్పంజ్ చేసినట్లు సమాచారం.
అయితే పార్లమెంటరీ నిబంధనల ప్రకారం రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలను అనంతరం లోక్సభ రికార్డుల నుంచి తొలగించారు. సభా మర్యాదలకు విరుద్ధంగా ఉన్నాయనే కారణంతో వాటిని ఎక్స్పంజ్ చేసినట్లు సమాచారం
. విద్యార్థుల నిరసనలు, వాటిపై కేంద్ర ప్రభుత్వ వైఖరి, అలాగే లోక్సభలో జరిగిన ఈ రాజకీయ ఘర్షణ దేశ రాజకీయాల్లో మరోసారి వేడిని పెంచింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు, అమిత్ షా గైర్హాజరు, వ్యాఖ్యల తొలగింపు వంటి పరిణామాలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ వ్యవహారంపై అధికార పక్షం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Comments
Sign in with Google to comment.