భద్రాచలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం విస్తరణ, సమగ్ర అభివృద్ధి పనులకు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్ వేదపండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి శుభారంభం చేశారు.
ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులు భక్తులకు మరింత మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించడంతో పాటు దేవస్థానం ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంపొందించే దిశగా కీలక మైలురాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం భక్తుల అవసరాలకు అనుగుణంగా ఆలయ మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే వాతావరణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇంజినీరింగ్ అధికారులు, వేదపండితులు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Sign in with Google to comment.