హబ్సీగూడ డివిజన్ పరిధిలోని రామంతాపూర్ పెద్ద చెరువు సుందరీకరణ పనులను ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పరిశీలించారు.
స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పనుల పురోగతిని పరిశీలించిన ఆయన, రూ.19 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 18.23 ఎకరాల చెరువు పరిసర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. బతుకమ్మ కొలను, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్తో పాటు పలు ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ అభివృద్ధి పనుల వల్ల ఎవరికీ నష్టం కలగదని స్పష్టం చేసిన ఆయన, రామంతాపూర్ చిన్న చెరువు, నాచారం పటేల్కుంట చెరువుల సుందరీకరణకు కూడా నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే అక్కడ కూడా పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Sign in with Google to comment.