ఇంద్రకీలాద్రి పుణ్యక్షేత్రంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిసరాల పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం క్షేత్రస్థాయిలో వివిధ ప్రాంతాలను పరిశీలించిన ఆయన, శివాలయం నుంచి పూజా మండపాలకు వెళ్లే మార్గంలో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను వెంటనే శుభ్రం చేయాలని సూచించారు.
కొండపై ఏర్పాటు చేసిన తాగునీటి పంపుల వద్ద పరిశుభ్రతను నిరంతరం నిర్వహించాలని, చండీ హోమం ప్రాంతంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఇంజినీరింగ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా, ప్రధాన ఆలయంలో “ఓం కనకదుర్గాయ నమః” అనే అమ్మవారి నామం నిరంతరం మైక్ ద్వారా వినిపించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే రూ.500 దుర్గా దివ్య దర్శనం పూర్తి చేసిన భక్తులు తమ ఉచిత లడ్డూను ఎక్కడ పొందవచ్చో మైక్ ద్వారా స్పష్టంగా ప్రకటించాలని ఈఓ ఆదేశించారు.
Comments
Sign in with Google to comment.