ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శనివారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అమ్మవారు కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ఈఓ సీనా నాయక్ సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు శేషవస్త్రం, తీర్థప్రసాదాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో దుర్గగుడి పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
అనంతరం మహామండపంలో జరిగిన ప్రైవేట్ వివాహ వేడుకకు హాజరైన మంత్రి నారా లోకేష్ నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Sign in with Google to comment.