Latest
"₹1,400 కోట్ల BRS నిధులు అవినీతి డబ్బు, తెలంగాణ శహీదుల కుటుంబాలకు తిరిగి ఇవ్వండి": BRS నాయకత్వంపై పేలుడు దాడి కరోనా మళ్లీ కోరలు చాస్తోందా?.. ఏపీలో ఇద్దరి మృతి, అధికారుల్లో అలర్ట్! వెంకట సాయి నగర్ కాలనీకి సీసీ రోడ్లు మంజూరు చేయాలని మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్‌కు వినతి అమెరికా బాంబింగ్ ఇరాన్‌లో 14 మంది ప్రాణాలు తీసింది, టెహ్రాన్ ప్రతీకార దాడుల తర్వాత గల్ఫ్ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా కఠిన హెచ్చరిక జారీ చేసింది: జేడీ వాన్స్ చెప్పారు, ఇరాన్ హోర్మూజ్ జలదారిపై చర్యలు తీసుకుంటే సైనిక చర్యలు జరిగే అవకాశం ఉంది. "₹1,400 కోట్ల BRS నిధులు అవినీతి డబ్బు, తెలంగాణ శహీదుల కుటుంబాలకు తిరిగి ఇవ్వండి": BRS నాయకత్వంపై పేలుడు దాడి కరోనా మళ్లీ కోరలు చాస్తోందా?.. ఏపీలో ఇద్దరి మృతి, అధికారుల్లో అలర్ట్! వెంకట సాయి నగర్ కాలనీకి సీసీ రోడ్లు మంజూరు చేయాలని మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్‌కు వినతి అమెరికా బాంబింగ్ ఇరాన్‌లో 14 మంది ప్రాణాలు తీసింది, టెహ్రాన్ ప్రతీకార దాడుల తర్వాత గల్ఫ్ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా కఠిన హెచ్చరిక జారీ చేసింది: జేడీ వాన్స్ చెప్పారు, ఇరాన్ హోర్మూజ్ జలదారిపై చర్యలు తీసుకుంటే సైనిక చర్యలు జరిగే అవకాశం ఉంది.

మనమిత్ర వాట్సప్ ద్వారా దర్శనం, ఆర్జిత సేవా టికెట్లు అందుబాటులోకి

మనమిత్ర వాట్సప్ ద్వారా శ్రీశైలంలో దర్శనం, ఆర్జిత సేవా టికెట్లు, విరాళాల చెల్లింపులు భక్తులకు సులభంగా అందుబాటులోకి వచ్చాయి.

AP/SOUTH

శ్రీశైల దేవస్థానం భక్తులకు మరింత సులభంగా సేవలు అందించేందుకు “మనమిత్ర” వాట్సప్ సేవలను విస్తరించినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు తెలిపారు. ఇకపై శ్రీస్వామివారి స్పర్శ దర్శనం టికెట్లు కూడా మనమిత్ర వాట్సప్ ద్వారా పొందే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. దర్శన టికెట్లతో పాటు మొత్తం 18 రకాల ఆర్జిత సేవా టికెట్లు కూడా మనమిత్ర ద్వారా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా భక్తులు విరాళాలను కూడా ఈ వాట్సప్ సేవ ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. భక్తులకు మనమిత్ర సేవలపై అవగాహన కల్పించేందుకు క్షేత్ర పరిధిలో ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే క్యూ కాంప్లెక్స్ ఎదుట మనమిత్ర సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, సి.ఆర్.ఓ కార్యాలయం, గణేశ్ సదన్ తదితర ప్రాంతాల్లో కూడా సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరోక్ష సేవా టికెట్లను కూడా మనమిత్ర ద్వారా పొందే సదుపాయం కల్పించినట్లు ఈఓ తెలిపారు. శ్రీశైలానికి స్వయంగా రాలేని భక్తులు తమ గోత్రనామాలతో పరోక్షంగా సేవలు నిర్వహించుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ విధానంలో భాగంగా పలు శాఖలకు సంబంధించిన సేవలను వేగవంతంగా, పారదర్శకంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009 ను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ఈ మనమిత్ర సేవ ద్వారా శ్రీస్వామివారి స్పర్శ దర్శనం, శీఘ్ర దర్శనం, అతిశీఘ్ర దర్శనం టికెట్లతో పాటు ఆర్జిత గర్భాలయ అభిషేకం, సామూహిక అభిషేకం, కుంకుమార్చన, గణపతి హోమం, రుద్ర హోమం, మహామృత్యుంజయ హోమం, చండీ హోమం, కల్యాణోత్సవం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం వంటి 18 రకాల సేవా టికెట్లు పొందవచ్చని తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యనిర్వహణాధికారి కోరారు.

Related Stories

Latest Articles

  1. "₹1,400 కోట్ల BRS నిధులు అవినీతి డబ్బు, తెలంగాణ శహీదుల కుటుంబాలకు తిరిగి ఇవ్వండి": BRS నాయకత్వంపై పేలుడు దాడి
  2. కరోనా మళ్లీ కోరలు చాస్తోందా?.. ఏపీలో ఇద్దరి మృతి, అధికారుల్లో అలర్ట్!
  3. వెంకట సాయి నగర్ కాలనీకి సీసీ రోడ్లు మంజూరు చేయాలని మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్‌కు వినతి
  4. అమెరికా బాంబింగ్ ఇరాన్‌లో 14 మంది ప్రాణాలు తీసింది, టెహ్రాన్ ప్రతీకార దాడుల తర్వాత గల్ఫ్ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
  5. అమెరికా కఠిన హెచ్చరిక జారీ చేసింది: జేడీ వాన్స్ చెప్పారు, ఇరాన్ హోర్మూజ్ జలదారిపై చర్యలు తీసుకుంటే సైనిక చర్యలు జరిగే అవకాశం ఉంది.
  6. మోన్సూన్ కోపం: వరదలు, భూకంపాలు మరియు నీటి నిల్వల కారణంగా దేశవ్యాప్తంగా సంక్షోభం, 60 మందికి పైగా మరణాలు
  7. మోడీ మెల్బోర్న్‌లో: భారత-ఆస్ట్రేలియా మైత్రి ప్రపంచ的不确定తను అధిగమించేందుకు సిద్ధంగా ఉంది
  8. సమంత యొక్క Maa Inti Bangaram అన్ని కాలాల బాక్స్ ఆఫీస్ మైలురాయిని చేరుకోవడానికి పరుగులు తీయుతోంది.
  9. పుణె భవనం కూలిన ఘటన: రెండవ రోజుకు చేరుకున్న రక్షణ చర్యలో తొమ్మిది మంది రక్షించబడ్డారు, చిక్కుకున్న వ్యక్తుల కోసం శోధన తీవ్రత పెరుగుతోంది.
  10. నెల్లూరులో RTC రెండవ డిపో ప్రైవటీకరణ చర్యపై ఆరోపణలతో మానవ శ్రేణి నిరసన ప్రారంభమైంది.
Comments

Sign in with Google to comment.