Latest
మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత

మనమిత్ర వాట్సప్ ద్వారా దర్శనం, ఆర్జిత సేవా టికెట్లు అందుబాటులోకి

మనమిత్ర వాట్సప్ ద్వారా శ్రీశైలంలో దర్శనం, ఆర్జిత సేవా టికెట్లు, విరాళాల చెల్లింపులు భక్తులకు సులభంగా అందుబాటులోకి వచ్చాయి.

AP/SOUTH

శ్రీశైల దేవస్థానం భక్తులకు మరింత సులభంగా సేవలు అందించేందుకు “మనమిత్ర” వాట్సప్ సేవలను విస్తరించినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు తెలిపారు. ఇకపై శ్రీస్వామివారి స్పర్శ దర్శనం టికెట్లు కూడా మనమిత్ర వాట్సప్ ద్వారా పొందే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. దర్శన టికెట్లతో పాటు మొత్తం 18 రకాల ఆర్జిత సేవా టికెట్లు కూడా మనమిత్ర ద్వారా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా భక్తులు విరాళాలను కూడా ఈ వాట్సప్ సేవ ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. భక్తులకు మనమిత్ర సేవలపై అవగాహన కల్పించేందుకు క్షేత్ర పరిధిలో ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే క్యూ కాంప్లెక్స్ ఎదుట మనమిత్ర సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, సి.ఆర్.ఓ కార్యాలయం, గణేశ్ సదన్ తదితర ప్రాంతాల్లో కూడా సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరోక్ష సేవా టికెట్లను కూడా మనమిత్ర ద్వారా పొందే సదుపాయం కల్పించినట్లు ఈఓ తెలిపారు. శ్రీశైలానికి స్వయంగా రాలేని భక్తులు తమ గోత్రనామాలతో పరోక్షంగా సేవలు నిర్వహించుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ విధానంలో భాగంగా పలు శాఖలకు సంబంధించిన సేవలను వేగవంతంగా, పారదర్శకంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009 ను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ఈ మనమిత్ర సేవ ద్వారా శ్రీస్వామివారి స్పర్శ దర్శనం, శీఘ్ర దర్శనం, అతిశీఘ్ర దర్శనం టికెట్లతో పాటు ఆర్జిత గర్భాలయ అభిషేకం, సామూహిక అభిషేకం, కుంకుమార్చన, గణపతి హోమం, రుద్ర హోమం, మహామృత్యుంజయ హోమం, చండీ హోమం, కల్యాణోత్సవం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం వంటి 18 రకాల సేవా టికెట్లు పొందవచ్చని తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యనిర్వహణాధికారి కోరారు.

Related Stories

Latest Articles

  1. మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి
  2. భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది.
  3. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది.
  4. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది.
  5. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత
  6. ఎస్‌పీ–బీఎస్పీ యూపీ ప్రభుత్వాన్ని తీవ్ర ఉష్ణతరంగం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఒత్తిడిని కలిగించినందుకు విమర్శించాయి.
  7. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వైరల్ crowdsourced అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించింది, భారీ ఆన్‌లైన్ చర్చను ప్రేరేపించింది
  8. ఇరాన్ సంక్షోభం ట్రంప్‌ను తన కొడుకు వివాహానికి హాజరుకాకుండా చేయవచ్చని, "కృత్రిమ వార్తలు నన్ను ఏదో ఒక విధంగా చంపుతాయి" అని చెప్పారు.
  9. భారత మహిళా శాస్త్రవేత్త అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనలో చరిత్ర సృష్టించింది
  10. ఇంధన ధరల షాక్, పడుతున్న రూపాయి భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తున్నాయి; మధ్య తరగతి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
Comments

Sign in with Google to comment.