Latest
మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత

ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యాలు, పరిశుభ్రతపై ఈవో శీనా నాయక్ సమీక్ష

ఇంద్రకీలాద్రిలో భక్తుల సౌకర్యాలు, పరిశుభ్రత, తాగునీరు, అన్నప్రసాద నాణ్యత మెరుగుపై ఈవో శీనా నాయక్ అధికారులతో సమీక్ష నిర్వహించారు

AP/SOUTH

ఇంద్రకీలాద్రిలో భక్తుల సౌకర్యాలు, పరిశుభ్రత, మౌలిక వసతుల అభివృద్ధిపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ సమీక్ష నిర్వహించారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణతో కలిసి శుక్రవారం మహా మండపం నాలుగో అంతస్తులో ఇంజినీరింగ్, శానిటేషన్ మరియు ఇతర ప్రధాన విభాగాల అధికారులతో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సమీక్షలో భాగంగా దుర్గా ఘాట్ స్నానాల రేవు నుంచి కనకదుర్గ నగర్, ఘాట్ రోడ్డు, మహా మండపం సహా ఆలయ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఈవో ఆదేశించారు. పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఘాట్ రోడ్డు టోల్ గేట్ నుంచి ‘ఓం’ టర్నింగ్ వరకు రోడ్డు బలోపేత పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ పనుల కారణంగా కొద్ది రోజుల పాటు ఘాట్ రోడ్డును మూసివేసే అవకాశం ఉన్నందున, భక్తులకు ఇబ్బందులు కలగకుండా కనకదుర్గ నగర్‌లో ప్రత్యామ్నాయ మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని సూచించారు. ఇంజినీరింగ్ అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఉండి పనులను పర్యవేక్షించాలని ఈవో స్పష్టం చేశారు. ఏఈలు, డీఈలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. భక్తులకు అందించే అన్నప్రసాదాల నాణ్యతను మరింత మెరుగుపరచాలని, పరిశుభ్రతతో పాటు రుచికరమైన భోజనం అందించాలని ఆదేశించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసరాల్లో భక్తులకు నిరంతర తాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించడమే ప్రధాన లక్ష్యంగా అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఈవో శీనా నాయక్ ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ విభాగాల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఇంజినీరింగ్ అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Related Stories

Latest Articles

  1. మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి
  2. భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది.
  3. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది.
  4. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది.
  5. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత
  6. ఎస్‌పీ–బీఎస్పీ యూపీ ప్రభుత్వాన్ని తీవ్ర ఉష్ణతరంగం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఒత్తిడిని కలిగించినందుకు విమర్శించాయి.
  7. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వైరల్ crowdsourced అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించింది, భారీ ఆన్‌లైన్ చర్చను ప్రేరేపించింది
  8. ఇరాన్ సంక్షోభం ట్రంప్‌ను తన కొడుకు వివాహానికి హాజరుకాకుండా చేయవచ్చని, "కృత్రిమ వార్తలు నన్ను ఏదో ఒక విధంగా చంపుతాయి" అని చెప్పారు.
  9. భారత మహిళా శాస్త్రవేత్త అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనలో చరిత్ర సృష్టించింది
  10. ఇంధన ధరల షాక్, పడుతున్న రూపాయి భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తున్నాయి; మధ్య తరగతి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
Comments

Sign in with Google to comment.