భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనే ప్రధాన లక్ష్యంగా అన్ని విభాగాలు పనిచేయాలని కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు సూచించారు. నిర్వహించిన సమీక్షా సమావేశంలో దర్శన ఏర్పాట్లు, మంచినీటి సదుపాయం, అన్నప్రసాద వితరణ, శౌచాలయాల నిర్వహణ, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు.
వేసవి తీవ్రత దృష్ట్యా ప్రధాన కూడళ్లలో ఉచిత చలివేంద్రాలు ఏర్పాటు చేసి మంచినీరు, మజ్జిగ అందిస్తున్నట్లు తెలిపారు. క్యూలైన్లు, ఆలయ ప్రాంగణంలో నిరంతరం తాగునీటి సరఫరా ఉండేలా చూడాలని, మరిన్ని మట్టికుండలను ఏర్పాటు చేయాలని సూచించారు.
అన్నప్రసాద వితరణలో పరిశుభ్రత, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, తాజా కూరగాయలనే వినియోగించాలని ఆదేశించారు. భక్తులకు త్వరితగతిన, ఆత్మీయంగా సేవలు అందించాలని పేర్కొన్నారు.
క్షేత్ర పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను పటిష్టంగా కొనసాగిస్తూ, దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలను ఆలయ ప్రసార వ్యవస్థ ద్వారా భక్తులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Sign in with Google to comment.