భక్తులకు డిజిటల్ చెల్లింపుల సౌకర్యాన్ని మరింత విస్తరించేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, శ్రీశైలం శాఖ శ్రీశైలం దేవస్థానానికి 50 పీఓఎస్ (POS) మిషన్లను విరాళంగా అందజేసింది. బ్యాంకు అధికారులు ఈ మిషన్లను దేవస్థానం ఈవో ఎం. శ్రీనివాసరావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, టోల్గేట్, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం, ప్రసాదాల కౌంటర్లలో ఈ మిషన్లను ఏర్పాటు చేసి, ఫోన్పే, గూగుల్పే, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా భక్తులు సులభంగా డిజిటల్ చెల్లింపులు చేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం పీఓఎస్ మిషన్లను అందించిన యూనియన్ బ్యాంక్ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీశైలం దేవస్థానానికి యూనియన్ బ్యాంక్ నుంచి 50 పీఓఎస్ మిషన్ల విరాళం
శ్రీశైలం దేవస్థానానికి యూనియన్ బ్యాంక్ 50 పీఓఎస్ మిషన్లు విరాళంగా అందజేసి, భక్తులకు డిజిటల్ చెల్లింపుల సౌకర్యాన్ని మరింత విస్తరించింది.
Comments
Sign in with Google to comment.