నేపాల్లో భీకర వరదల విషాదం కొనసాగుతోంది. నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదలకు మృతుల సంఖ్య 470 దాటింది. మరోవైపు, వరదలతో ఏర్పడిన సరస్సు నీటిమట్టం పెరుగుతుండటంతో మరో భారీ వరద ముప్పు పొంచి ఉంది.
మూడో రోజు కూడా సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే తాజా వరద ముప్పు నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లకు తాత్కాలిక విరామం ఇచ్చారు. ప్రజలు, సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు హెచ్చరించారు
టిబెట్ వైపు డ్యామ్/బ్యారియర్ సరస్సు నుంచి నీరు విడుదలయ్యే ప్రమాదం ఉందన్న సమాచారం నేపథ్యంలో నేపాల్ పోలీసులు, వరద అంచనా విభాగం అప్రమత్తమయ్యాయి. భోటేకోషి, త్రిశూలి, నారాయణి నదీ పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
రెస్క్యూ సిబ్బంది, భారీ యంత్రాలను సైతం ప్రమాద ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. పరిస్థితి మరింత విషమిస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించే చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
Comments
Sign in with Google to comment.