Latest
నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.

ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!

ఒలింపిక్స్‌లో భారత్ ప్రాతినిధ్యం విస్తరించాల్సిందేనని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సర్ఫింగ్, స్పోర్ట్ క్లైంబింగ్‌ వంటి క్రీడల్లోకి యువత రావాలని సూచించారు.

India

న్యూఢిల్లీ: ఒలింపిక్ క్రీడల్లో భారత్ తన ప్రాతినిధ్యాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘ఖేలో ఇండియా సంవాద్ – ఖేల్ కీ బాత్, పీఎం కే సాత్’ కార్యక్రమంలో ఆయన యువత, క్రీడాకారులను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 1,600 ప్రాంతాల్లో 8 లక్షలకు పైగా యువతను కలుపుతోంది.

ఒలింపిక్స్‌లోని అనేక క్రీడాంశాల్లో భారత్ కనీస ప్రాతినిధ్యం కూడా సాధించలేకపోతున్న పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. సర్ఫింగ్, స్పోర్ట్ క్లైంబింగ్ వంటి కొత్త క్రీడల్లోకి భారత యువత పెద్ద సంఖ్యలో అడుగుపెడితేనే ఒలింపిక్ పతకాల సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంటుందని ఆయన సూచించారు.

2036 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని శాస్త్రీయ విధానంలో ప్రతిభను గుర్తించడం, క్రీడా మౌలిక వసతులను బలోపేతం చేయడం, యువతను క్రీడల వైపు మరింతగా ఆకర్షించడం వంటి అంశాలపై ‘ఖేలో ఇండియా సంవాద్’లో ప్రత్యేక దృష్టి పెట్టారు.

పతకాలకే కాదు.. దేశ నిర్మాణానికి క్రీడలు!

 క్రీడలను కేవలం పతకాల సాధనకు పరిమితం చేయకూడదని మోదీ పేర్కొన్నారు. క్రమశిక్షణ, ఫిట్‌నెస్, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ జాతి నిర్మాణంలో క్రీడలు కీలక పాత్ర పోషించాలి అన్నది కేంద్రం దిశగా ఉందని తెలిపారు.

 కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ సహా పలువురు క్రీడా రంగ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువత నుంచి 2036 ఒలింపిక్స్‌కు సంబంధించిన సూచనలు, అభిప్రాయాలను సేకరించి క్రీడా రంగ అభివృద్ధికి ఉపయోగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Related Stories

Latest Articles

  1. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  2. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  3. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  4. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  5. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  6. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  7. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  8. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  9. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
  10. Telangana....సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
Comments

Sign in with Google to comment.