శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి జగద్గురు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి ఈరోజు ఆలయాన్ని సందర్శించి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మహాస్వామివారికి రాజగోపురం వద్ద ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకస్వాములు, వేదపండితులు, ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం మహాస్వామివారు ఆలయంలో శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజాదిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో మహాస్వామివారి గౌరవార్థం వేదగోష్ఠి నిర్వహించగా, గురువందన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మహాస్వామివారు అనుగ్రహ భాషణం చేస్తూ సనాతన ధర్మ విశిష్టతను వివరించడంతో పాటు క్షేత్ర మహిమను, శివానందలహరి మరియు సౌందర్యలహరి స్తోత్రాల ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు.
చివరగా మహాస్వామివారు భక్తులందరికీ ఆశీర్వచనాలు అందజేశారు.
Comments
Sign in with Google to comment.