Latest
తమిళనాడు సీఎం NEP మూడు భాషల సూత్రానికి వ్యతిరేకంగా, ఇది హిందీ బలవంతంగా విధించడం అని పేర్కొన్నారు. SCR కవచ్ 4.0 మరియు ABS ప్రారంభంతో భద్రతా లక్ష్యాలను అధిగమించింది లోకరక్షిణి తలంపులమ్మ అమ్మవారి జాతరలో ఆధ్యాత్మిక వాతావర భక్తుల పట్ల మర్యాద, సేవాభావంతో వ్యవహరించాలని సిబ్బందికి దిశానిర్దేశం కనక దుర్గా దేవాలయంలో భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ చేయబడింది. తమిళనాడు సీఎం NEP మూడు భాషల సూత్రానికి వ్యతిరేకంగా, ఇది హిందీ బలవంతంగా విధించడం అని పేర్కొన్నారు. SCR కవచ్ 4.0 మరియు ABS ప్రారంభంతో భద్రతా లక్ష్యాలను అధిగమించింది లోకరక్షిణి తలంపులమ్మ అమ్మవారి జాతరలో ఆధ్యాత్మిక వాతావర భక్తుల పట్ల మర్యాద, సేవాభావంతో వ్యవహరించాలని సిబ్బందికి దిశానిర్దేశం కనక దుర్గా దేవాలయంలో భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ చేయబడింది.

శ్రీశైలం దేవస్థానంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా ముగింపు

శ్రీశైలం దేవస్థానంలో ఉగాది మహోత్సవాలు పూర్ణాహుతి, వసంతోత్సవం, అవభృథం, త్రిశూలస్నానం కార్యక్రమాలతో ఘనంగా ముగిశాయి, భక్తుల పాల్గొనికతో వైభవం నెలకొంది

Devotional/Cultural

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో నిర్వహించిన ఉగాది మహోత్సవాలు పూర్ణాహుతి, వసంతోత్సవం, అవభృథం, త్రిశూలస్నానం కార్యక్రమాలతో వైభవంగా ముగిశాయి. మహోత్సవాల చివరి రోజున స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించగా, యాగశాలలో చండీశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు జరిపించారు.

అనంతరం లోకకల్యాణం కోసం జపాలు, నిత్యహోమాలు, బలిహరణలు నిర్వహించారు. పూర్ణాహుతి శాస్త్రోక్తంగా నారికేళాలు, సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు, పగడాలు, నూతన వస్త్రాలు తదితర ద్రవ్యాలను హోమగుండంలో ఆహుతిగా సమర్పించి యాగకార్యక్రమాన్ని పూర్తి చేశారు. వసంతోత్సవం పూర్ణాహుతి అనంతరం వసంతోత్సవం నిర్వహించబడింది. ఈ సందర్భంగా పసుపు, సున్నం, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన మంత్రపూరిత జలాన్ని భక్తులపై ప్రోక్షించారు. అవభృథం – త్రిశూలస్నానం వసంతోత్సవం అనంతరం చండీశ్వరస్వామివారిని ఆలయ ప్రదక్షిణతో మల్లికాగుండం వద్దకు తీసుకెళ్లి అవభృథం నిర్వహించారు.

 శుద్ధజలం, పంచామృతాలు, భస్మోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, సుగంధోదకం, బిల్వోదకం, పుష్పోదకం, నారికేళోదకం తదితరాలతో స్నపన కార్యక్రమం నిర్వహించారు. తదుపరి త్రిశూలస్నానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సమయంలో మల్లికాగుండ జలాన్ని తలపై ప్రోక్షించుకోవడం ద్వారా పాపాలు నశించి శ్రేయస్సు కలుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు.

ఈ కార్యక్రమాలలో కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, అర్చకులు, వేదపండితులు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు మరియు భక్తులు పాల్గొన్నారు. దేవస్థానం అధికారుల ఉత్తర్వుల మేరకు ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.

Related Stories

Latest Articles

  1. తమిళనాడు సీఎం NEP మూడు భాషల సూత్రానికి వ్యతిరేకంగా, ఇది హిందీ బలవంతంగా విధించడం అని పేర్కొన్నారు.
  2. SCR కవచ్ 4.0 మరియు ABS ప్రారంభంతో భద్రతా లక్ష్యాలను అధిగమించింది
  3. లోకరక్షిణి తలంపులమ్మ అమ్మవారి జాతరలో ఆధ్యాత్మిక వాతావర
  4. భక్తుల పట్ల మర్యాద, సేవాభావంతో వ్యవహరించాలని సిబ్బందికి దిశానిర్దేశం
  5. కనక దుర్గా దేవాలయంలో భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ చేయబడింది.
  6. రైల్వే మంత్రి న్యూఢిల్లీ స్టేషన్‌లో నమూనా కోచ్‌ను పరిశీలించారు.
  7. హైదరాబాద్ భారతదేశం యొక్క క్రీడా కేంద్రంగా మారబోతుంది: రేవంత్ రెడ్డి గచ్చిబౌలి స్టేడియం మెగా ప్రణాళికను వెల్లడించారు.
  8. 🔥 “Sponsored Jungle Raj”: PM Modi’s Fierce Attack on TMC Over Malda Incident
  9. 📰 బ్రేకింగ్: ట్రంప్ అమెరికా-ఇరాన్ చర్చల్లో సాధ్యమైన విరామంపై సంకేతాలు ఇస్తున్నారు
  10. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీ ఆత్మవిశ్వాసంతో ఉంది, డీఎంకే అవినీతి ఆరోపించింది: కోవా. లక్ష్మణ్
Comments

Sign in with Google to comment.