Latest
మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత

శ్రీ తలంపులమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్

తలంపులమ్మ ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించిన కలెక్టర్, క్యూయాస్క్ ప్రారంభించి పర్యావరణ పరిరక్షణపై సూచనలు చేశారు.

Devotional/Cultural

లోవ గ్రామంలో వెలసిన శ్రీ తలంపులమ్మ అమ్మవారి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ శ్రీ సగిలి షణ్మోహన్ సందర్శించారు.

 ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆలయంలో నిర్మాణంలో ఉన్న నూతన ఘాట్ రోడ్డు పనులు, ఘాట్ రోడ్ దిగువ నుంచి రోడ్డు విస్తరణ పనులు, అలాగే ఇప్పటికే పూర్తైన రాజగోపురం మరియు మహా మండపం నిర్మాణ పనుల పురోగతిపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి కలెక్టర్‌కు వివరించారు. జరిగిన మరియు కొనసాగుతున్న అభివృద్ధి పనుల వ్యయ వివరాలతో కూడిన సమగ్ర నివేదికను కూడా ఆయనకు సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన కలెక్టర్‌కు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు, అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం కలెక్టర్‌కు అమ్మవారి శేషవస్త్రం, జ్ఞాపిక అందజేయగా, వేదపండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయంలో దర్శనాలు, ప్రసాదాలు, వసతి తదితర సేవలను సులభంగా అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ సేవలు, మన మిత్ర, ఏపీ టెంపుల్స్ యాప్ వంటి సాంకేతిక సౌకర్యాలపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా కరూర్ వైశ్యా బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యూయాస్క్ మిషన్లను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. భక్తులు ప్రభుత్వం అభివృద్ధి చేసిన సాంకేతిక వసతులను వినియోగించుకుని ఆలయ సేవలను మరింత సులభంగా పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆలయంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ, ప్రత్యామ్నాయంగా బయోడిగ్రేడబుల్ కవర్లు, కాగితం, నారా ఉత్పత్తులు వంటి పర్యావరణ హిత వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ఈ విషయంపై భక్తుల్లో మరింత అవగాహన కల్పించి, ఆచరణలోకి తీసుకురావాలని దేవస్థానం అధికారులకు ఆదేశించారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు జిల్లా కలెక్టర్ కార్యనిర్వహణాధికారికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ ఇంజనీర్, తుని మండల తహసీల్దార్, పంచాయతీరాజ్ శాఖ డి.డి.ఇ., రెవెన్యూ సిబ్బంది, కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ మరియు సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Stories

Latest Articles

  1. మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి
  2. భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది.
  3. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది.
  4. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది.
  5. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత
  6. ఎస్‌పీ–బీఎస్పీ యూపీ ప్రభుత్వాన్ని తీవ్ర ఉష్ణతరంగం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఒత్తిడిని కలిగించినందుకు విమర్శించాయి.
  7. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వైరల్ crowdsourced అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించింది, భారీ ఆన్‌లైన్ చర్చను ప్రేరేపించింది
  8. ఇరాన్ సంక్షోభం ట్రంప్‌ను తన కొడుకు వివాహానికి హాజరుకాకుండా చేయవచ్చని, "కృత్రిమ వార్తలు నన్ను ఏదో ఒక విధంగా చంపుతాయి" అని చెప్పారు.
  9. భారత మహిళా శాస్త్రవేత్త అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనలో చరిత్ర సృష్టించింది
  10. ఇంధన ధరల షాక్, పడుతున్న రూపాయి భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తున్నాయి; మధ్య తరగతి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
Comments

Sign in with Google to comment.