శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం సిబ్బంది భక్తుల పట్ల మర్యాద, సేవాభావంతో వ్యవహరించాలని ఆలయ ఈవో వీకే శీనా నాయక్ సూచించారు.
ఆదివారం నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, భక్తుల సంతృప్తినే మొదటి కర్తవ్యంగా భావించి విధులు నిర్వర్తించాలని ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. అన్నదానం, పూజా విభాగాలు, ఫెస్టివల్ సెక్షన్, స్టేషనరీ వంటి కీలక విభాగాల సిబ్బంది మరింత అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.
భక్తులతో ఎలా మాట్లాడాలి, రద్దీ సమయాల్లో ఎలా వ్యవహరించాలి, చట్టాలు మరియు ప్రభుత్వ మార్గదర్శకాలను ఎలా అమలు చేయాలనే అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.
Comments
Sign in with Google to comment.