శ్రీశైలం దేవస్థానంలో వసతి రిజర్వేషన్, ఆర్జిత సేవలు మరియు దర్శనం టికెట్లను ముందస్తుగా పొందాలనుకునే భక్తులు కేవలం రాష్ట్ర దేవదాయశాఖ లేదా దేవస్థానం అధికారిక వెబ్సైట్ల ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఈఓ శ్రీ ఎం. శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం ప్రజా సేవలను సులభతరం చేసేందుకు మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ను అందుబాటులోకి తెచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆలయ దర్శనం టికెట్లు, ఆర్జిత సేవలు, ప్రసాదాల టికెట్లు మరియు విరాళాల చెల్లింపులు పొందవచ్చని తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా శ్రీశైలం ఆలయంలో స్పర్శ దర్శనం, శీఘ్ర దర్శనం, అతిశీఘ్ర దర్శనం టికెట్లతో పాటు 17 రకాల ఆర్జిత సేవలు—గర్భాలయ అభిషేకం, కుంకుమార్చన, రుద్రహోమం, మహామృత్యుంజయ హోమం, చండీహోమం, కల్యాణోత్సవం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం తదితర సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. భక్తులు వసతి రిజర్వేషన్ మరియు అన్ని సేవల టికెట్ల కోసం www.aptemples.ap.gov.in� లేదా www.srisailadevasthanam.org� అధికారిక వెబ్సైట్లను మాత్రమే వినియోగించాలని సూచించారు. ఫోన్పే లేదా గూగుల్పే ద్వారా వ్యక్తిగత ఖాతాలకు నగదు చెల్లించమని ఎవరూ అడగరని, అలా అడిగితే అది సైబర్ మోసమని భక్తులు గుర్తించాలని హెచ్చరించారు.
నకిలీ వెబ్సైట్లను నమ్మవద్దని కూడా సూచించారు. అలాగే ఆలయ పరిధిలో 8 ప్రదేశాల్లో కియోస్క్ మిషన్లు ఏర్పాటు చేశామని, త్వరలో మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సందేహాల నివృత్తి కోసం భక్తులు 83339 01351 / 52 / 53 నంబర్లను సంప్రదించవచ్చని ఈఓ చెప్పారు
Comments
Sign in with Google to comment.