హైదరాబాద్, మే 20: సరస్వతీ అంత్య పుష్కరాలను భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక వైభవంతో జరుపుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మే 21 నుంచి జూన్ 1 వరకు జగిత్యాల జిల్లా కాళేశ్వరం వద్ద జరిగే ఈ మహా పుణ్యకార్యానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పుష్కర స్నానాల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా పనిచేయాలని సీఎం ఆదేశించారు
. ఘాట్ల వద్ద భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, విశ్రాంతి కేంద్రాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. భక్తుల రాకపోకలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఎండల తీవ్రత దృష్ట్యా భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని, తాగునీరు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సీఎం సూచించారు.
భక్తుల రాకపోకలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఎండల తీవ్రత దృష్ట్యా భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని, తాగునీరు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సీఎం సూచించారు.
పుష్కరాలు ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో సజావుగా కొనసాగాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి, ఈ పుణ్యకాలం రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలను తీసుకురావాలని కోరుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ సరస్వతీ అంత్య పుష్కరాల శుభాకాంక్షలు తెలియజేశారు. కాళేశ్వరంలో భక్తజన సందోహంతో పుష్కర ఘాట్లు కిటకిటలాడనున్నాయి.
Comments
Sign in with Google to comment.