ఉప్పల్లోని బ్యాంక్ కాలనీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన శిఖర ప్రతిష్ఠ, బలిపీఠం, సింహవాహన ప్రతిష్ఠ మహోత్సవంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Sign in with Google to comment.