ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన ప్రతినిధులు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు, కార్యదర్శి దొంతుల వెంకట్రాంరెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. రెండోసారి చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి గ్యారంపల్లి శివాజీలు కలిసి మెమెంటోను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ ప్రెస్ క్లబ్కు తమ వంతు సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఉప్పల్ ప్రెస్ క్లబ్ నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పారెల్లి సాగర్, ఉపాధ్యక్షులు శ్రీధర్ రావు, నరోత్తం రెడ్డి, కోశాధికారి గుత్తి శేఖర్, జాయింట్ సెక్రటరీ దాసరాజు, ఓ. రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్కు సంపూర్ణ సహకారం మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి హామీ
ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన ప్రతినిధులు మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. ప్రెస్స్ క్లబ్కు సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Comments
Sign in with Google to comment.