తుని మండలం లోవ గ్రామంలో శ్రీ తలంపులమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. లోవ కొత్తూరు గ్రామం నుండి గరగాలను పుట్టదారకు తీసుకువచ్చి శుద్ధి, పూజలు నిర్వహించిన అనంతరం, అర్చకులు, గ్రామ పెద్దలు, భక్తులతో కలిసి ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకువచ్చి ఉత్సవాలను ప్రారంభించారు.
భక్తుల కోసం ఉచిత ప్రసాదం, మజ్జిగ, మంచినీరు ఏర్పాటు చేయగా, ఈరోజు నుండి 17వ తేదీ వరకు గరగోత్సవాలు నిర్వహించనున్నారు. జాతర సందర్భంగా పక్షం రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
Comments
Sign in with Google to comment.