ఈ నెల 8వ తేదీ నుంచి గచ్చిబౌలిలోని గచ్చిబౌలి హాకీ స్టేడియం లో జరగనున్న ఉమెన్ వరల్డ్ హాకీ కప్–2026 క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ వివరాలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం లో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, మార్చి 8 నుంచి 14 వరకు జరిగే ఈ అంతర్జాతీయ పోటీల్లో భారత్తో పాటు ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ జట్లు పాల్గొంటున్నాయని వారు చెప్పారు. అన్ని జట్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని, అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేసిన ఆస్ట్రోటర్ఫ్ మైదానంలో సాధన ప్రారంభించాయని మంత్రి అన్నారు. క్రీడాకారిణుల కోసం హై సెక్యూరిటీ, ఆధునిక వసతి సదుపాయాలు, సమగ్ర ఏర్పాట్లు పూర్తయ్యాయని వారు చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో రాష్ట్రంలో క్రీడలకు విశేష ప్రాధాన్యం పెరిగిందని, ఈ టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. గచ్చిబౌలిలో జరిగే ఈ హాకీ పోటీలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రోత్సాహం అందించాలని మంత్రి కోరారు.
Comments
Sign in with Google to comment.