తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.
హైదరాబాద్లోని లోక్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్ కుమార్ సింగ్ ఆయనతో గవర్నర్గా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు మరియు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఉత్తరప్రదేశ్కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు శివ్ ప్రతాప్ శుక్లా గతంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తన దీర్ఘకాల రాజకీయ అనుభవంతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తారని పలువురు నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Sign in with Google to comment.