సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ భద్రత అంశాలపై విస్తృత సమీక్ష నిర్వహించారు.
అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాశ్తో పాటు ప్రిన్సిపల్ హెడ్లు, అన్ని ఆరు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. రైలు ఆపరేషన్లలో భద్రతను మరింత బలోపేతం చేయడానికి దశలవారీ చర్యలు తీసుకోవాలని శ్రీవాస్తవ సూచించారు. ట్రాక్ల భద్రత కోసం పాయింట్లు, క్రాసింగ్లు, సేఫ్టీ అలారమ్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
ట్రాక్ల సమీపంలో పనులు జరుగుతున్నప్పుడు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్త సూచనలు జారీ చేయాలని స్పష్టం చేశారు. రైల్వే ప్రాంగణాల్లో ప్రమాదాలు నివారించేందుకు భద్రతా పరికరాల నిర్వహణపై కూడా సమీక్షించారు. నాన్-ఇంటర్లాక్డ్ లెవల్ క్రాసింగ్ గేట్ల పరిస్థితి, రైల్వే ఫిట్టింగ్స్ నాణ్యతపై కూడా సమగ్రంగా పరిశీలించారు.
Comments
Sign in with Google to comment.