శ్రీరామనవమి పండుగ సందర్భంగా శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ వెల్లడించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో ప్రజలందరికీ ఈ మేరకు సమాచారం అందజేస్తూ, తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్–1968లోని సెక్షన్ 20(1) ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతలు భద్రంగా ఉండేందుకు ముందస్తు చర్యలలో భాగంగా కళ్ళు దుకాణాలు, కల్లు డిపోలు, ఐఎంఎల్ (A4) షాపులు, 2-బి బార్లు, క్లబ్బులు, టిడి-1, సిఎస్-2 తదితర మద్యం విక్రయ కేంద్రాలు మార్చి 27 ఉదయం 6 గంటల నుండి మార్చి 28 ఉదయం 6 గంటల వరకు పూర్తిగా మూసివేయబడనున్నట్లు తెలిపారు. శ్రీరామనవమి వేడుకలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరగాలని, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని కమిషనర్ కోరారు.
శాంతిభద్రతల దృష్ట్యా 24 గంటల పాటు మద్యం విక్రయాల నిలిపివేత
రామనవమి సందర్భంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో 24 గంటల పాటు వైన్స్ షాపులు బంద్.
Comments
Sign in with Google to comment.