Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

పోలీసుల కృషితో బాధితుడికి న్యాయం: మహబూబ్‌నగర్ ఎస్పీ డి. జానకి

మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్‌లో నమోదైన హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.

Telangana/karnataka

మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులకు గౌరవనీయ కోర్టు నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. పోలీసుల సమర్థవంతమైన దర్యాప్తుతో బాధితుడికి న్యాయం జరిగిందని జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ తెలిపారు. 2023 జనవరి 31న చన్నారెడ్డిపల్లి గ్రామ పరిధిలో భూవివాదం కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు వివరాల ప్రకారం, నిందితులు యెరుకలి వెంకటయ్య (A1), యెరుకలి శ్రీను (A2), యెరుకలి మల్లేష్ (A3) కలిసి బాధితుడు యెరుకలి చెన్నయ్యపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం A1, A3 కర్రలతో దాడి చేయగా, A2 కత్తితో పొడవడం జరిగింది. ఈ దాడిలో బాధితుడు తల, భుజాలు, వెన్ను, చేతులపై తీవ్ర గాయాలు పొందాడు. ఈ ఘటనపై 2023 ఫిబ్రవరి 1న నవాబ్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, పోలీసులు వేగంగా స్పందించి ఫిబ్రవరి 2న నిందితులను అరెస్ట్ చేశారు. కేసును క్రైం నంబర్ 31/2023గా నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణ అనంతరం మహబూబ్‌నగర్ ప్రధాన సహాయ సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. గౌరవ న్యాయమూర్తి శ్రీ వి. ఈశ్వరయ్య ముగ్గురు నిందితులకు ఒక్కొక్కరికి 4 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు, మొత్తం రూ.6,000 జరిమానా (ప్రతి ఒక్కరికి రూ.2,000 చొప్పున) విధించారు. అదనంగా, బాధితుడికి పరిహారంగా మొత్తం రూ.30,000 (ప్రతి నిందితుడు రూ.10,000 చొప్పున) చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసును సమర్థవంతంగా విచారించి నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి ఎస్‌ఐ జి. పురుషోత్తం, అదనపు ప్రజాప్రతినిధి మొహమ్మద్ అవేజ్, ప్రస్తుత ఎస్‌హెచ్‌ఓ విక్రం ఎస్‌ఐ, అసిస్టెంట్ సెషన్స్ కోర్టు లైజన్ ఆఫీసర్ కె. నర్సింహులు మరియు సంబంధిత పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డి. జానకి అభినందించారు. జిల్లా పోలీసులు ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్నారని, ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.