Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

ఉద్యమకారుల గౌరవం, సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది: ఎమ్మెల్సీ విజయశాంతి

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని భరోసా

Telangana/karnataka

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల గౌరవం, ఆత్మగౌరవం, సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ విజయశాంతి స్పష్టం చేశారు. శాసనమండలిలో ఉద్యమకారుల సమస్యలను సానుకూలంగా ప్రస్తావించిన ఆమె, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను త్వరలోనే అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. విజయశాంతి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పాత్ర అపారమైందని, వారి త్యాగాలు, పోరాటాలు, సమర్పణ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఉద్యమకారులకు కేవలం గౌరవం ఇవ్వడం మాత్రమే కాకుండా, వారి సంక్షేమం కోసం ప్రకటించిన హామీలను అమలు చేయడం కూడా ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు ఉద్యమకారులు ఎమ్మెల్సీ విజయశాంతిని మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనమండలిలో తమ సమస్యలను సానుభూతితో, సానుకూల దృక్పథంతో ప్రస్తావించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

 ఉద్యమకారులతో ఆప్యాయంగా ముచ్చటించిన విజయశాంతి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతుందని, ఉద్యమకారుల సంక్షేమం పట్ల పార్టీ పూర్తి నిబద్ధతతో ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం దశలవారీగా ఉద్యమ సైనికుల కోసం ప్రకటించిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుందని ఆమె తెలిపారు.

 

అలాగే, ఉద్యమకారుల ఆత్మగౌరవం, గౌరవప్రదమైన జీవనం, వారి కుటుంబాల భద్రత కోసం తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్సీ విజయశాంతి హామీ ఇచ్చారు. ఆమె వ్యక్తం చేసిన ఆప్యాయత, నమ్మకానికి ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు.

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.