Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

బీజేపీ ఎంపీ సూర్య తేజస్వి వ్యాఖ్యలపై తెలంగాణలో ఆగ్రహం – విజయశాంతి ఫైర్

తెలంగాణ విభజనపై బీజేపీ ఎంపీ సూర్య తేజస్వి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం. విజయశాంతి తీవ్రంగా ఖండిస్తూ లోక్‌సభ స్పీకర్ జోక్యం కోరారు. తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తత.

Telangana/karnataka

తెలంగాణ రాష్ట్ర విభజనను పాకిస్థాన్ విభజన కంటే ఘోరంగా పోల్చిన బీజేపీ ఎంపీ సూర్య తేజస్వి వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమ చరిత్రను, వేలాది మంది చేసిన త్యాగాలను అవమానించేలా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన దీర్ఘకాల పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడటం రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీసింది.

మాజీ ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్రంగా స్పందిస్తూ, ఈ వ్యాఖ్యలు “పుండుమీద కారం చల్లినట్లే” అని మండిపడ్డారు. పార్లమెంట్ సీట్ల పెంపు అంశంలో ఇప్పటికే తెలంగాణకు అన్యాయం జరుగుతుందేమోనన్న అనుమానాలు ఉన్న సమయంలో ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం అనుచితమని ఆమె పేర్కొన్నారు. 

అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పందనపై కూడా విజయశాంతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణను సాధించడంలో టీఆర్ఎస్ పాత్రపై ప్రశ్నలు లేవనెత్తడం ద్వారా అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఉద్యమంలో పాల్గొన్న నాయకుల పాత్రను తెలంగాణ ప్రజలు బాగా తెలుసునని స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కే. చంద్రశేఖర్ రావు పోరాటాన్ని గుర్తు చేస్తూ, ఉద్యమ స్ఫూర్తిని గౌరవించినందువల్లే సోనియా గాంధీ రాష్ట్ర విభజనకు అంగీకరించారని విజయశాంతి పేర్కొన్నారు. ఈ చరిత్రను వక్రీకరించడం సరైంది కాదని ఆమె హెచ్చరించారు.

 తెలంగాణ కు N చెందిన బీజేపీ ఎంపీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని విజయశాంతి నిలదీశారు. “బీజేపీ నిజంగా తెలంగాణ భావోద్వేగాలను గౌరవిస్తుందా? లేక రాజకీయ ప్రయోజనాల కోసం అవమానిస్తుందా?” అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో మిన్నంటుతోంది.

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.