దేశ చరిత్రలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా చారిత్రక మైలురాయిని చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని మోదీపై దేశ ప్రజలు ఉంచిన అపార విశ్వాసానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం లోక్ భవన్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో గవర్నర్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ఆర్థికాభివృద్ధి, డిజిటల్ విప్లవం, మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు అనేక రంగాల్లో విశేష పురోగతి సాధించిందని తెలిపారు. అంతర్జాతీయ వేదికపై భారతదేశ ప్రతిష్ఠ మరింత పెరిగిందని, జాతీయ ప్రయోజనాల పరిరక్షణలో కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధన కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు దేశాన్ని అభివృద్ధి చెందిన శక్తిగా తీర్చిదిద్దనున్నాయని గవర్నర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ మరిన్ని విజయాలు సాధిస్తూ అభివృద్ధి పథంలో మరింత వేగంగా ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. “తెలంగాణ ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన నాయకత్వంలో దేశం మరింత ప్రగతి, సుసంపన్నత సాధించి ‘వికసిత్ భారత్–2047’ లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు
Comments
Sign in with Google to comment.