Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా చారిత్రక మైలురాయి దిశగా మోదీ.. శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా చారిత్రక ఘనత సాధించనున్న ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నాయకత్వాన్ని ప్రశంసించారు.

Telangana/karnataka

దేశ చరిత్రలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా చారిత్రక మైలురాయిని చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని మోదీపై దేశ ప్రజలు ఉంచిన అపార విశ్వాసానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం లోక్ భవన్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో గవర్నర్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ఆర్థికాభివృద్ధి, డిజిటల్ విప్లవం, మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు అనేక రంగాల్లో విశేష పురోగతి సాధించిందని తెలిపారు. అంతర్జాతీయ వేదికపై భారతదేశ ప్రతిష్ఠ మరింత పెరిగిందని, జాతీయ ప్రయోజనాల పరిరక్షణలో కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధన కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు దేశాన్ని అభివృద్ధి చెందిన శక్తిగా తీర్చిదిద్దనున్నాయని గవర్నర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ మరిన్ని విజయాలు సాధిస్తూ అభివృద్ధి పథంలో మరింత వేగంగా ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. “తెలంగాణ ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన నాయకత్వంలో దేశం మరింత ప్రగతి, సుసంపన్నత సాధించి ‘వికసిత్ భారత్–2047’ లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు 

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.