సున్నిపెంట ప్రాంత భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మంగళవారం సున్నిపెంటలో రూ.10 కోట్ల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను తో కలిసి ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ శ్రీశైలం డ్యామ్ పరిసర ప్రాంతాల అభివృద్ధి, భూముల వినియోగం, ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
సున్నిపెంటలో మరిన్ని డ్రైనేజీలు, అంతర్గత రహదారుల నిర్మాణానికి ఇప్పటికే అంచనాలు సిద్ధం చేశామని, త్వరలో పరిపాలనా అనుమతులు పొందనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. శ్రీశైలం డ్యామ్ నిర్మాణం కోసం గతంలో అటవీ భూములను డీ-రిజర్వ్ చేసి సుమారు 1468 ఎకరాలు కేటాయించారని, ప్రస్తుతం 1427 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు ఆధునిక సర్వేలో గుర్తించామని కలెక్టర్ వెల్లడించారు. ఈ ప్రాంతంలో 5,824 నిర్మాణాలు, 22 వేలకుపైగా జనాభా ఉన్నట్లు తెలిపారు. ప్రజల అభిప్రాయాల సేకరణ ప్రక్రియను పొడిగించి, దరఖాస్తుల స్వీకరణకు అదనపు గడువు ఇచ్చినట్లు చెప్పారు.
ప్రజల వినతిపత్రాలు, రిటన్ స్టేట్మెంట్లను సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వం, న్యాయస్థానానికి పూర్తి నివేదిక సమర్పిస్తామని తెలిపారు. అక్రమ ఆక్రమణలు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కలెక్టర్ ప్రజల రిటన్ స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన ఇళ్లను ఖాళీ చేయించబోమని భరోసా ఇచ్చారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ సున్నిపెంట ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు.
ఇప్పటికే రోడ్లు, తాగునీటి పనులకు రూ.10 కోట్లు మంజూరు చేశామని, త్వరలో ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందించే చర్యలు చేపడతామని తెలిపారు. గ్రామంలోని సీసీ రోడ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని, అర్హులైన వారికి పక్కా గృహాలు కూడా మంజూరు చేస్తామని ఎమ్మెల్యే అన్నారు.
Comments
Sign in with Google to comment.