Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

సచివాలయం సామాన్యులకు దూరమా..? సిఫారసు ఉంటేనే దర్శనమా..?

తెలంగాణ సచివాలయంలో సాధారణ ప్రజలకు ప్రవేశం దొరకడం లేదనే విమర్శలు పెరుగుతున్నాయి. గంటల తరబడి వేచి చూసినా మంత్రులను కలిసే అవకాశం లేకపోతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Hyderabad News

హైదరాబాద్: తెలంగాణ ప్రజల సమస్యలకు పరిష్కార కేంద్రంగా ఉండాల్సిన రాష్ట్ర సచివాలయం ఇప్పుడు సామాన్య ప్రజలకు అందని కోటగా మారిందా అనే ప్రశ్నలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. తమ సమస్యలను నేరుగా మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్‌కు చేరుకునే ప్రజలకు సచివాలయం గడప దాటడమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తమవుతోంది.

 గంటల తరబడి సచివాలయం వెలుపల వేచి చూసినా మంత్రులను కలిసే అవకాశం దక్కడం లేదని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వారికి అనుమతులు నిరాకరించబడుతుండగా, సన్మానాలు, మర్యాదపూర్వక భేటీలు, సిఫారసులతో వచ్చే వారికి మాత్రం తలుపులు సులభంగా తెరుచుకుంటున్నాయనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా కీలక మంత్రులను కలవాలంటే ముందస్తు అపాయింట్‌మెంట్, రాజకీయ పరిచయాలు లేదా బలమైన సిఫారసు తప్పనిసరిగా మారిపోయిందనే అభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది. ప్రజల కోసం నడవాల్సిన పాలనా వ్యవస్థలో సామాన్యుడి స్వరం వినిపించకపోతే, అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

గత ప్రభుత్వంపై "ప్రజలకు దూరమైంది" అంటూ తీవ్ర విమర్శలు చేసిన ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిఫారసు ఉన్నవారికే సచివాలయం తలుపులు తెరుచుకుంటే, సాధారణ ప్రజల సమస్యలను వినేది ఎవరు? ప్రజా ప్రభుత్వంలో ప్రజలకే ప్రవేశం లేకపోతే అది ఎవరి ప్రభుత్వం అన్న ప్రశ్నలు ఇప్పుడు బహిరంగ చర్చకు దారితీస్తున్నాయి.

ప్రజల కష్టాలు వినేందుకు ఏర్పడిన వ్యవస్థలో ప్రజలకే ప్రవేశం లేకపోవడం, సమస్యలు చెప్పుకునే అవకాశమే లేకపోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. తెలంగాణ సచివాలయం నిజంగా ప్రజల సచివాలయమేనా? లేక సిఫారసులు, పరిచయాలు ఉన్నవారికే పరిమితమైన అధికార కేంద్రంగా మారుతోందా? అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.